ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ బ్యాట్స్మెన్ 194 పరుగులు మాత్రమే చేయగలిగారు.
మ్యాచ్ను మలుపు తిప్పిన జోష్ హాజిల్వుడ్
ఆర్సీబీ ఉంచిన భారీ టార్గెట్ ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్ వరకు పట్టుబిగించింది. మ్యాచ్లో బలమైన జట్టుగా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా వరుసగా వికెట్లు జారవిడుచుకుని మ్యాచ్ ను కోల్పోయింది.
ముఖ్యంగా జోష్ హేజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్లోని 19వ ఓవర్ మ్యాచ్లో నిర్ణయాత్మకంగా నిలిచింది. ఆ ఓవర్లో జోష్ హాజిల్వుడ్ కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి ధ్రువ్ జురెల్ (47) పెద్ద వికెట్తో సహా రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో హాజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.