206 పరుగుల భారీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీలు మంచి ఆరంభం అందించారు. 16 పరుగులు చేసి వైభవ్ అవుట్ అయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న జైస్వాల్ సునామీ రేపాడు. సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 49 పరుగులు తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. నితీస్ రానా 28, రియాన్ పరాగ్ 22, ధ్రువ్ జురేల్ 47 పరుగులు ఇన్నింగ్స్ ఆడారు.