ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల స్వంత రాష్ట్రం కావడంతో వాళ్లిద్దరూ గుజరాత్ పై ప్రత్యేక దృష్టి నిలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి 99 సీట్లు రాగా కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. కానీ తర్వాత పలువురు పార్టీలు మారడం, రాజీనామాలతో బీజేపీ బలం 111 కు పెరిగింది.