ఇక మరోవైపు, జడేజా భవిష్యత్పై కూడా చర్చ జరుగుతోంది. భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు ముగ్గురు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతారా అనే అనుమానాల మధ్య, మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు.