ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ లో శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు ముందే రోహిత్ శర్మ అండ్ కో. కు ముంబై మాజీ సారథి హర్భజన్ సింగ్ ముందస్తు వార్నింగ్ ఇచ్చాడు. గుజరాత్ ఆటగాడు రషీద్ ఖాన్ తో జాగ్రత్తగా ఉండాలని భజ్జీ సూచించాడు.