ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడటమే గాక భారత క్రికెట్ జట్టుకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లను ఇచ్చిన జట్టు ముంబై ఇండియన్స్. సచిన్ టెండూల్కర్, జయసూర్య, రికీ పాంటింగ్, షాన్ పొలాక్, లసిత్ మలింగ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు ముంబైకి ఆడారు.