ఫెర్గూసన్ స్థానంలో ఎవరు వస్తారో తెలియదు. అతని స్థానంలో అస్మతుల్లా ఒమర్జాయ్ జట్టులోకి రావచ్చు. కానీ అతను మీడియం పేసర్. అందుకే ఫెర్గూసన్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్ జట్టులోకి రావచ్చు. అతనితో పాటు పంజాబ్ టీమ్ లోకి వచ్చే ప్లేయర్ల లిస్టులో మరికొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు జాకబ్ డఫీ. 2025లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాకబ్ డఫీ. పవర్ప్లే స్పెషలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ న్యూజిలాండ్ బౌలర్, ఇప్పుడు అన్ని దశల్లో అద్భుతమైన బౌలర్ గా మారాడు. ఇటీవల జరిగిన ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్లో 13 వికెట్లు తీసి, న్యూజిలాండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రికార్డును సమం చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు.