కాగా.. ఇప్పటికిప్పుడు రహానే, పుజారాలు దేశవాళీ క్రికెట్ ఆడాలన్నా ఆ అవకాశం లేదు. కరోనా కారణంగా జనవరి, ఫిబ్రవరి లో జరగాల్సిన రంజీ సీజన్ కూడా వాయిదా పడింది. మళ్లీ దానిని ఎప్పుడు నిర్వహిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక ఫిబ్రవరి మాసాంతంలో శ్రీలంక జట్టు భారత్ తో టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో పుజరా, రహానే లు శ్రీలంక పర్యటన తర్వాతే దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం దక్కుతుంది.