అహ్మదాబాద్ కు చెందిన 31 ఏండ్ల ప్రియాంక్ పాంచల్ దేశవాళీ క్రికెట్ లో గుజరాత్ తరఫున సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాడు. 2008లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగ్రేటం చేసినా అతడికి ఇంతవరకు గుర్తింపు దక్కలేదు. ఇప్పటివరకు 100 దాకా ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పాంచల్.. 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 24 శతకాలు, 25 అర్థ శతకాలు చేశాడు. అత్యధిక స్కోరు 314 నాటౌట్ గా ఉంది.