టీమిండియాకి ఆడడం కంటే నీకు ఐపీఎల్ ముఖ్యమా... రోహిత్ శర్మపై ఫైర్ అయిన మాజీ కెప్టెన్...
First Published Nov 6, 2020, 5:57 PM ISTIPL 2020 సీజన్లో అన్నింటికంటే పెద్ద చర్చకు దారి తీసిన అంశం రోహిత్ శర్మ గాయం. అక్టోబర్ 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన ‘డబుల్ సూపర్ ఓవర్’ మ్యాచ్లో గాయపడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లో బరిలో దిగలేదు. రోహిత్ గాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆస్ట్రేలియా సిరీస్కి కూడా ‘హిట్ మ్యాన్’కి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ.