పీసీబీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాక ఇటీవల వరుసగా టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తలలో వ్యక్తిగా నిలుస్తున్న మాజీ చైర్మన్ రమీజ్ రాజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. పదవిలో ఉన్నప్పుడు బీసీసీఐపై నిత్యం ఏదో రకంగా కామెంట్స్ చేసే అలవాటున్న రమీజ్.. తాజాగా మళ్లీ నోటికి పనిచెప్పాడు. బీసీసీఐలో బీజేపీ మైండ్సెట్ ఉందని, అది పాకిస్తాన్ క్రికెట్ వినాశనానికి దారి తీస్తుందని అన్నాడు.