ప్యాట్ కమ్మిన్స్ యూటర్న్... ముందుగా ప్రధాని సహాయ నిధికి ఇస్తానని చెప్పి, ఇప్పుడేమో...

First Published May 3, 2021, 7:26 PM IST

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులను, కోవిద్‌-19తో భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, చలించిపోయిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్... 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

తొలుత ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన ఆసీస్ పేసర్, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
undefined
యూనిసెఫ్ ఆస్ట్రేలియా సంస్థకి విరాళాన్ని ఇచ్చిన ప్యాట్ కమ్మిన్స్, దాన్ని కరోనా బాధితుల సహాయార్థం వినియోగించాల్సిందిగా కోరాడు.
undefined
ఏప్రిల్ 26న ప్రధానమంత్రి సహాయ నిధికి 50 వేల డాలర్లు (దాదాపు 37 లక్షల రూపాయలు) విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ప్యాట్ కమ్మిన్స్‌ను హర్షిస్తూ, భారత ప్రజలు ట్వీట్ల వర్షం కురిపించారు...
undefined
అయితే ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి ఇస్తే, అది కరోనా రోగులకు చేరే అవకాశం చాలా తక్కువగా, ప్రభుత్వం ఆ మొత్తాన్ని సరిగా వినియోగించలేదని... కాబట్టి సోనూసూద్ ఎన్‌జీవోలకు లేక మరేదైనా సంస్థకు విరాళం ఇవ్వాలంటూ కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్లు.
undefined
భారత ప్రజలు, ప్రభుత్వంపై ఎంత నమ్మకంగా ఉన్నారో పసిగట్టిన ప్యాట్ కమ్మిన్స్... ప్రధానమంత్రి సహాయనిధికి కాకుండా యూనిసెఫ్ సంస్థకు విరాళం ఇచ్చినట్టు తెలుస్తోంది...
undefined
ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కూడా ఇండియాలో పెరిగిపోతున్న కరోనా నియంత్రణ కోసం 50 వేల డాలర్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. భారత్‌లో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందిపడుతున్న ఆసుపత్రులకు ఈ నిధిని వినియోగించబోతున్నట్టు పేర్కొంది.
undefined
click me!