గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాక్ మీద ఓడినా రికార్డులు మాత్రం భారత్ కే అనుకూలంగా ఉన్నాయి. టీ20లలో భారత్-పాక్ 9 మ్యాచులాడగా.. అందులో 7 సార్లు భారత్ గెలవగా రెండు సార్లు పాకిస్తాన్ నెగ్గింది. ఇక పాకిస్తాన్ జట్టులో బాబర్, రిజ్వాన్, అఫ్రిది ల గురించి రషీద్ మాట్లాడాడు. కానీ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజాలు ఐసీసీ ర్యాంకుల్లో గతంలోనే నెంబర్ వన్ లుగా నిలిచి తమ సత్తా ఏంటో చాటుకున్నవారేనన్న విషయం మరువరాదని లతీఫ్ కు టీమిండియా అభిమానులు సూచిస్తున్నారు.