ఈ టోర్నీకి భారత జట్టు మెంటర్గా వ్యవహరించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మ్యాచ్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ ప్లేయర్లతో కలిసి మాట్లాడాడు. మాహీ క్రీజులోకి వచ్చిన సమయంలో చాలామంది పాక్ క్రికెటర్లు అతని చుట్టూ చేరి... శిష్యుల్లా చేతులు కట్టుకుని ధోనీ మాటలను విన్నారు...