వీరితో పాటు పహల్గామ్ దాడిని యావత్ క్రికెట్ ప్రపంచం ఖండించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని క్రికెటర్లు సందేశం ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఆకాశ్ చోప్రా, మనోజ్ తివారీ, యువరాజ్ సింగ్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా పలువురు క్రికెటర్లు దాడిని ఖండించారు.
పహల్గామ్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన గుండె పగిలిపోయిందని రోహిత్ శర్మ పగిలిన హార్ట్ సింబల్ ను పంచుకున్నాడు.