ఇక ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం ప్రేక్షకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది గనక.. స్టాండింగ్ టికెట్స్ ను కూడా అందుబాటులో ఉంచగా.. అవి కూడా అమ్ముడైనట్టు ఐసీసీ తెలిపింది. ఇండియా-పాకిస్తాన్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ లలో కూడా టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.