అయితే, మ్యాచ్లో రియాన్ పరాగ్ విషయంలో పెద్ద వివాదం నెలకొంది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో అతను ఔట్ అయిన తర్వాత, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరో డ్రామా కనిపించింది అతను అవుట్ అయ్యాడా లేదా అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మొదలైంది.
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు 14 బంతుల్లోనే 12 పరుగులకే తొలి రెండు వికెట్లు కోల్పోయింది.
దీని తరువాత, రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. అతను మూడు సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చాడు. అదే జోష్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుల్వంత్ ఖేజ్రోలియా చేతిలో అవుట్ అయ్యాడు. రియాన్ 14 బంతుల్లో 26 పరుగుల ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 3 సిక్సర్లు బాదాడు.