2008 నుంచి సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన వారు కొద్దిమందే ఉన్నారు. భారత క్రికెట్ నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని వంటి వారు ఈ జాబితాలో ముందుంటారు. అయితే ఐపీఎల్ లో ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజాలు వచ్చినా టీమిండియా సారథి రోహిత్ శర్మ మాత్రం ఈ లీగ్ లో మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ అంటున్నాడు రైనా.