ఇటీవలే ముగిసిన ఐపీఎల్ కొత్త టీమ్ ల బిడ్ల ప్రక్రియలో లక్నోను రూ. 7,090 కోట్లతో చేజిక్కించుకున్న ఆర్పీఎస్జీ.. రూ. 5,625 కోట్లతో అహ్మాదాబాద్ ను దక్కించుకున్న సీవీసీ లు ఆటగాళ్ల వేటలో పడ్దాయి. అయితే సీవీసీ.. పలు బెట్టింగ్ కంపెనీలతో వ్యవహారాలు నడుపుతున్నదని ఆరోపణలు వచ్చిన దరిమిలా.. బీసీసీఐ దానిపై విచారణ చేపట్టింది.