పిచ్ కాదు, ఇంగ్లాండ్ ఓటమికి ప్రధాన కారణం అదే... ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్...

First Published Feb 26, 2021, 1:31 PM IST

మొదటి టెస్టులో టీమిండియాను 227 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. రెండో టెస్టులో టీమిండియా చేతిలో 317 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లాండ్, మూడో టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది... అయితే ఈ రెండు ఓటములకు పిచ్‌ను కారణంగా చూపిస్తోంది ఇంగ్లాండ్...

రెండు టెస్టుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు చేసిన ఇంగ్లాండ్ జట్టు, ఆ తర్వాత ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ 200+ స్కోరు చేయలేకపోయింది.
undefined
‘ఇంగ్లాండ్ జట్టు ఓటమికి పిచ్ కారణం కాదు... టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న రొటేషన్ పద్ధతి కారణంగానే ఓటమి పాలైంది. భారత జట్టును, భారత్‌లో ఎదుర్కోవడం అంటే చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం...
undefined
ఇలాంటి సిరీస్‌ల్లో బెస్ట్ టీమ్‌తో బరిలో దిగాల్సి ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ మాత్రం రొటేషన్ పద్ధతిని అనుసరిస్తూ, అందరికీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది...
undefined
ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ కోసం పటిష్టమైన జట్టును నిర్మించాలని ఇంగ్లాండ్ ఆలోచిస్తోంది, అయితే ఇది యాషెస్ సిరీస్ కంటే ముఖ్యమైనది, పెద్దది... టీమిండియాను స్వదేశంలో ఓడిస్తే, యాషెస్ సిరీస్ గెలిచినదాని కంటే పెద్ద విజయం పొందినట్టే...
undefined
భారత్‌లో పరిస్థితులు ఎప్పుడూ క్లిష్టంగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తేనే, వారి కెరీర్‌లో ఈ గెలుపు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఇలాంటి తప్పులు చేయదని నేను అనుకుంటున్నా...
undefined
టీమిండియా ఎప్పుడూ బెస్ట్ టీమ్‌తో ఆడాలని అనుకుంటుంది. అంతేకానీ రొటేషన్ పాలనీని ఫాలో అవ్వాలని అనుకోదు... ఇంటర్నేషనల్ క్రికెట్ చాలా మారిపోయింది. ఫామ్‌లో ఉంటేనే ఎలాంటి ఆటగాడికైనా జట్టులో చోటు దక్కుతోంది...
undefined
అవన్నీ వదిలేసి విన్నింగ్ కాంబినేషన్‌ను రొటేషన్ పాలసీ కోసం మార్చడం మూర్ఖత్వమే అవుతుంది... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్..
undefined
మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోఫెర్రీ బాయ్‌కాట్ కూడా ఇంగ్లాండ్ రొటేషన్ పాలసీని విమర్శించాడు. ‘ఇలాంటి పిచ్‌ని మాత్రమే తయారుచేయాలని ఎలాంటి రూల్స్ లేవు. పిచ్ ఎలా ఉండేలనేది మన చేతుల్లో లేదు, కానీ మనకంటే వాళ్లు బాగా ఆడారు. అందుకే గెలిచారు. సింపుల్...’ అంటూ కామెంట్ చేశాడు బాయ్‌కాట్.
undefined
మొదటి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన జేమ్స్ అండర్సన్, డొమినిక్ బేస్‌లకు రెండో టెస్టులో అవకాశం దక్కలేదు. మూడో టెస్టులో అండర్సన్‌కి చోటు దక్కినా, ఆర్చర్ తిరిగి రావడంతో బేస్‌ను పక్కనబెట్టాడు జో రూట్. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు కీలక వికెట్లు తీసిన బెస్ తిరిగి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.
undefined
అలాగే ఇంగ్లాండ్ రొటేషన్ పాలసీ కారణంగా రెండో టెస్టులో రాణించిన ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ వంటి క్రికెటర్లు ఇప్పటికే స్వదేశానికి చేరుకున్నారు కూడా. టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌కి కూడా చోటు దక్కకపోవడం మరో విశేషం.
undefined
click me!