నిన్న టీమిండియాకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ ఉండగా బౌలర్లు, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మినహా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రాక్టీస్ ముగిశాక ఆటగాళ్లకు సాండ్ విచ్, ఫ్రూట్స్, ఫలాఫెల్ (బీన్స్ తో తయారుచేసే డీప్ ఫ్రై వంటకం) ఇవ్వగా ఈ మెనూపై ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసి దానిని అక్కడే వదిలేసి హోటల్ రూమ్ కు వెళ్లి లంచ్ చేసినట్టు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తున్నది.