తాను ఎదుర్కొన్న మొదటి 24 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత 29 బంతుల్లో 67 పరుగులు చేసి టీమిండియాకి మరుపురాని విజయాన్ని అందించాడు. ఆఖరి 8 బంతుల్లో టీమిండియా విజయానికి 28 పరుగులు కావాల్సిన సమయంలో హారీస్ రౌఫ్ బౌలింగ్లో కొట్టిన రెండు సిక్సర్లు... మ్యాచ్ మొత్తానికే హైలైట్..