ఈ సీజన్ లో షా.. బ్యాట్ తో పెద్దగా రాణించడంలో విఫలమయ్యాడు. కానీ సర్పరాజ్ ఖాన్ మాత్రం 7 ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలతో ఏకంగా 803 పరుగులు చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ (419) కూడా సత్తా చాటుతున్నాడు. రంజీ సెమీస్ లో భాగంగా అతడు యూపీతో ఒకే మ్యాచ్ లో రెండు సెంచరీలు చేయడం విశేషం. వీళ్దిద్దరితో పాటు అర్మాన్ జాఫర్, సువేద్ పార్కర్ కూడా కీలక పరుగులతో ముంబైని నడిపిస్తున్నారు.