భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 296 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయావకాశాలు ఎలా ఉంటాయనేది నేటి ఆటపై ఆధారపడి ఉంటుంది. ఆసీస్ 400 ప్లస్ టార్గెట్ పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.