ఇప్పటికే వెస్టిండీస్ టూర్ కు వన్డే జట్టను ప్రకటించింది టీమిండియా. మూడు మ్యాచుల ఈ సిరీస్ లో భారత జట్టు సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లందరికీ రెస్ట్ ఇచ్చింది టీమ్ మేనేజ్మెంట్. అయితే వన్డేల తర్వాత జరిగే టీ20 సిరీస్ కు కూడా తనకు రెస్ట్ కావాలని కోహ్లి కోరాడట.