ఈ ఎఫ్టీపీలో భారత్.. 38 టెస్టులు (20 స్వదేశంలో, 18 విదేశాలలో), 42 వన్డేలు (స్వదేశం, విదేశాలలో 21 చొప్పున), 61 టీ20 (31 భారత్ లో, 31 విదేశాలలో) ఆడనుంది. గత ఎఫ్టీపీ (2018-2022) తో పోలిస్తే రాబోయే నాలుగేండ్లలో భారత్ ఆడబోయే మ్యాచ్ ల సంఖ్య (గతంలో 163, ఇప్పుడు 141) తగ్గింది. అయితే భారత్ లో ఐపీఎల్ తో పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ క్రికెట్ వల్ల అంతర్జాతీయ మ్యాచ్ ల సంఖ్య గణనీయంగా తగ్గింది.