"నిన్న పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలను కోల్పోవడం క్రికెట్ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధపెట్టింది. BCCI తరపున ఈ భయంకరమైన, పిరికి చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు మా సంతాపాన్ని తెలుపుతున్నాం. వారి బాధ, దుఃఖాన్ని పంచుకుంటూ, ఈ విషాద సమయంలో మేము చేయి చేయి కలిపి నిలబడతాము" అని సైకియా అన్నారు.
2008 ముంబై ఉగ్రవాద దాడి తర్వాత భారత గడ్డపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో బుధవారం సాయంత్రం సన్రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్ సందర్భంగా మరణించిన వారి ఆత్మలకు నివాళులర్పించేందుకు బీసీసీఐ చర్యలు తీసుకుంది. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఒక నిమిషం మౌనం పాటించారు, రెండు జట్ల ఆటగాళ్, అధికారులు సంతాపం తెలుపుతూ నల్లటి బ్యాండ్లు ధరించారు. బాణసంచా కాల్చడం, చీర్లీడర్ల ప్రదర్శనలు, వేడుకలు జరుపుకోలేదు.