ఈ ఏడాది ప్రారంభంలో సఫారీ పర్యటనకు వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చిన భారత్.. అక్కడ ఎదురైన పరాభావాలకు బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ సిరీస్ కోసం కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు అందుబాటులో లేరు. వారి స్థానంలో కొత్తవాళ్లకు అవకాశమిస్తున్నారు.