అయితే రాహుల్, పంత్ లు అనుభవలేమీ కారణంగా రోహిత్ శర్మకే ఈ పోస్టు దక్కవచ్చునని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత టెస్టులకు సారథిగా హిట్ మ్యాన్ పేరును ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.