ఓటమితో నిరుత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా క్రికెటర్లకు ప్రధాని ఓదార్పు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అయింది. క్లిష్ట సమయంలో తమకు ప్రధాని అండగా నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని భారత క్రికెటర్లు శమీ, జడేజా తదితరులు ట్విట్టర్ వేదికగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.