గతంలో ఏసీసీ చైర్మన్ గా పనిచేసిన నజమ్ సేథీ.. పాకిస్తాన్ కు ఇతర దేశాల క్రికెటర్లు నిశ్చింతంగా పర్యటించవచ్చునని, ఇక్కడ భద్రతకు తాము హామీ ఇస్తామని, ఆటగాళ్ల రక్షణ విషయంలో చింతించాల్సిన పన్లేదనే విషయాన్ని వాళ్లకు తెలియజేయనున్నాడు. మిగతా జట్లతో పాటు ఇండియా కూడా పాకిస్తాన్ కు తమ జట్టును పంపేలా ఆయన చర్చలు సాగనున్నాయి..’అని పీసీబీ ప్రతినిధి ఒకరు చెప్పారు.