వార్నర్ కు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను నడిపించిన అనుభవముంది. పంత్ లేని లోటును వార్నర్ తీరుస్తాడని ఢిల్లీ భావిస్తున్నది. ఒకవేళ వార్నర్ ను కాదనుకుంటే పృథ్వీ షా గానీ, మిచెల్ మార్ష్ గానీ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికో ఒకరికి సారథ్య పగ్గాలు అప్పజెప్పే అవకాశాలున్నాయి.