గతేడాది ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఓటమి.. ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అవడంతో పాటు టీ20 ప్రపంచకప్ లో జట్టు వైఫల్యాల కారణంగా రమీజ్ రాజాపై పాకిస్తాన్ ప్రభుత్వం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇక చీఫ్ సెలక్టర్ గా నియమితుడైన అఫ్రిది.. జట్టుకు ఎంపిక కావాలంటే ఆటగాళ్లకు కఠిన పరీక్షలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవలే అతడు.. టీ20 జట్టుకు ఎంపిక కావాలనుకున్నవాళ్ల స్ట్రైక్ రేట్ 135 కి తక్కువగా ఉండొద్దని, అలా ఉంటే వారిని సెలక్షన్స్ లో పట్టించుకోమని చెప్పిన విషయం తెలిసిందే.