2021 మెగా వేలాన్ని ఆపి వేయించాలి... లేదంటే వారికే నష్టం... ఆకాశ్ చోప్రా కామెంట్స్!

First Published Nov 22, 2020, 4:20 PM IST

IPL 2020 సీజన్ సూపర్ సక్సెస్‌తో ఊపుమీదున్న బీసీసీఐ, 2021 మెగా వేలం కోసం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఈ మెగా వేలంలో మరో అదనపు జట్టు వచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మెగా వేలం కారణంగా ప్రతీ ఫ్రాంఛైజీ, తమ వద్ద ఐదుగురు లేదా ఆరుగురుకి మించి ప్లేయర్లను ఉంచుకోవడానికి మాత్రమే వీలు ఉంటుంది. దీంతో ఈ మెగా వేలాన్ని నిలిపివేయించాలని షాకింగ్ కామెంట్లు చేశాడు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.

ఐపీఎల్ 2020 సీజన్‌లో పర్ఫామెన్స్ చూసిన ఎవ్వరికైనా ముంబై ఇండియన్స్ ఎంత పటిష్టమైన జట్టు అనేది ఇట్టే అర్థమవుతుంది...
undefined
టాప్ క్లాస్ ఆల్‌రౌండర్లు, నిప్పులు చెరిగే బంతులు వేయగల పేసర్లు, స్టార్ బ్యాట్స్‌మెన్... ఇలా ప్రత్యర్థి జట్టును భయపెట్టేంత స్ట్రాంగ్ టీమ్‌గా తయారైంది ముంబై ఇండియన్స్...
undefined
మెగా వేలం 2021 కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు ప్లేయర్లు కూడా వేలానికి వెళ్తారు. ముంబై ప్లేయర్ల కోసం మిగిలిన జట్లు తెగ పోటీపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది...
undefined
అందుకే మెగా వేలంలో ఏ ఆటగాళ్లను అట్టిపెట్టుకోవాలి? ఎవరిని వేలానికి వదిలిపెట్టాలి? వంటి లెక్కలతో బిజీబిజీగా గడుపుతున్నాయి అన్ని ఫ్రాంఛైజీలు...
undefined
‘ఐపీఎల్ 2021 మెగా వేలం జరగకుండా ముంబై ఇండియన్స్ అడ్డుకోవాలి. లేదంటే వారికే నష్టం. ప్రస్తుతం ఎంతో పటిష్టంగా ఉన్న ముంబై, మెగా వేలంలో కొందరు ఆటగాళ్లను కోల్పోవాల్సి ఉంటుంది..’ అని కామెంట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.
undefined
ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్... కొన్ని ఏళ్లుగా ఒకే జట్టును కొనసాగిస్తోంది. వేలం జరిగినా పెద్దగా ప్లేయర్లను కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే వారికి ఆ అవకాశం కూడా లేదు.
undefined
సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి క్రికెటర్లు మెగా వేలంలోకి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు విదేశీ ప్లేయర్లు, ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను మాత్రమే జట్టులో ఉంచుకోవడానికి వీలు ఉంటుంది...
undefined
ఆ విధంగా చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పోలార్డ్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రాలను కచ్ఛితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది ముంబై. హార్ధిక్ పాండ్యాపైన కూడా ముంబై భరోసా పెట్టొచ్చు.
undefined
హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, డి కాక్, సూర్యకుమార్ యాదవ్ లాంటి క్రికెటర్లు కానీ వేరే జట్లులోకి వెళితే ఐపీఎల్ 2021లో సీన్ మారిపోతుంది... ముంబై కాస్త వీక్ అయ్యే అవకాశం ఉంటుంది...
undefined
ఐపీఎల్ 2021లో ఒకటి లేదా రెండు కొత్త జట్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అహ్మదాబాద్ పేరుతో కొత్త జట్టు ఉంటుందని ప్రచారం జరుగుతుండగా, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ఓ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని టాక్ నడుస్తోంది.
undefined
click me!