MS Dhoni
MS Dhoni Podcast: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాడు. ఐపీఎల్ ఆటతో పాటు రిటైర్మెంట్ అంటూ వార్తల్లో నిలిచిన ధోని.. తాజాగా తన పాడ్కాస్ట్ ఎంట్రీతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. తన మొదటి పాడ్కాస్ట్లో ధోని తన క్రికెట్ ప్రయాణం ఎలా సాగిందనే విషయాలపై మాట్లాడారు.
2020 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన ధోని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మాత్రమే ఆడుతున్నాడు. ధోని ప్రస్తుతం తన 18వ ఐపీఎల్ సీజన్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ. 4 కోట్లకు అన్క్యాప్డ్ ప్లేయర్గా ధోనిని జట్టులోకి తీసుకుంది. గత ఐదు ఏళ్లు జాతీయ జట్టుకు ఆడని ప్లేయర్లను ఐపీఎల్ లో వారిని అన్క్యాప్డ్ ప్లేయర్లు గా రూల్స్ తీసుకువచ్చింది. అందుకే ధోని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఐపీఎల్ ఆడుతున్నాడు.
ధోని తొలి పాడ్కాస్ట్ ను ప్రఖ్యాత కంటెంట్ సృష్టికర్త రాజ్ షమానీ మోడరేట్ చేశాడు. అతనికి తన సొంత పాడ్కాస్ట్ కూడా ఉంది. కానీ, ధోని పాడ్కాస్ట్ కేవలం ధోని యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ చాట్ సమయంలో ధోనిని "ఒక ఓపెనింగ్ పెయిర్, ఒక బౌలింగ్ స్పెల్, ఒక ఆల్ రౌండర్" లలో మీరు ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా.. దానికి ధోని విచిత్రమైన సమాధానంతో ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
"చూడండి, మీరు వారు ఆడటం చూసినప్పుడు, వారి కంటే ఎవరూ మెరుగ్గా ఉండలేరని మీకు అనిపిస్తుంది. కానీ క్రికెట్ అనేది హెచ్చుతగ్గులకు లోనయ్యే ఆట. ఉత్తమ ఓపెనర్ను ఎంచుకోవడం చాలా కష్టం, కానీ నేను వారు ఆడటం చూశాను. యూవరాజ్ (యూవీ) 6 సిక్సర్లు కొట్టినప్పుడు, నేను మరెవరినీ చూడవలసిన అవసరం లేదు. నేను ఒక ఆటగాడిని ఎందుకు ఎంచుకోవాలి? జట్టుకు చాలా మ్యాచ్లు గెలిచిన ఆటగాళ్లు ఉన్నారు. అవును, ఇంతకు ముందు.. ఇలాంటి కవరేజ్ లేదు. గతంలో కూడా నాకు తెలియని ఇలాంటి ప్రదర్శనలు చాలా ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ చేయబడవు. నేటి తరానికి వాటి గురించి తెలియదు" అని ధోని పాడ్కాస్ట్ సందర్భంగా రాజ్ షమానీతో అన్నారు.
Dhoni
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ అయిన ధోనీ, తాను దేశానికి ప్రాతినిధ్యం పై మాట్లాడుతూ.. "నేను దేశం తరపున ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. నేను రాంచీలో నివసించేవాడిని. గతంలో అది బీహార్, ఇప్పుడు అది జార్ఖండ్. మా జట్టులో క్రికెట్ కెరీర్ చరిత్ర లేదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, నేను భారతదేశం తరపున ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. మేము స్కూల్లో ఉన్నప్పుడు, మేము టెన్నిస్ బాల్తో ఆడేవాళ్ళం.. ఆ సమయంలో నేను బౌలింగ్ చేసేవాడిని" అని ధోని చెప్పాడు.
MS Dhoni (Photo: IPL)
అలాగే, "ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని.. బక్కగా ఉండేవాడిని. అప్పుడు నన్ను వికెట్ కీపింగ్ చేయమని చెప్పారు... నేను ఎప్పుడూ నా కంటే సీనియర్ వ్యక్తులతో క్రికెట్ ఆడేవాడిని. నా వయసులో క్రికెట్ ఆడే అబ్బాయిలు చాలా తక్కువ. కాబట్టి నా కంటే సీనియర్లతో క్రికెట్ ఆడటం నాకు చాలా ముఖ్యం. సీనియర్లతో ఆడటం నాకు సహాయపడింది. నేను దాని తప్ప మరేమీ చేయలేదు. నేను నా తండ్రికి చాలా భయపడే వాడిని. ఆయన ఎల్లప్పుడూ సమయపాలన పాటించేవారు. నేను కూడా నా తండ్రిలాగే ఉంటాను" అని ధోని చెప్పాడు.
కాగా, ధోని భారత్ ను విజయవంతమైన జట్టుగా ముందుకు నడిపించాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. టీ20 ప్రపంచ కప్ (2007), వన్డే ప్రపంచ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013)లను భారత్ ధోని కెప్టెన్సీలోనే గెలుచుకుంది.