అలాగే, యంగ్ క్రికెటర్లకు ధోని ఎప్పుడూ సలహాలు ఇస్తుంటాడు. అలాగే, ఇప్పుడు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. మీకు ఏది మంచిదో మీరు తెలుసుకోవాలని అన్నాడు. .
“మీకు ఏది మంచిదో మీరు తెలుసుకోవాలి. నేను ఆడేటప్పుడు క్రికెట్ అంటే నాకు అన్నీ అని అనుకునేవాడిని. వేరే ఏదీ ముఖ్యం కాదు. నేను ఏ టైమ్కి పడుకోవాలి? ఏ టైమ్కి లేవాలి? అది క్రికెట్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేదే ముఖ్యం” అని ధోని చెప్పాడు.
“దోస్తాన్, సరదాలు, పార్టీలు అన్నీ తర్వాతే. ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. దాన్ని మీరు గుర్తిస్తే మీకంటే గొప్పగా ఎవరూ ఉండరు” అని ధోని అన్నారు.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎక్కువ పరుగులు చేసిన వారిలో ధోని రెండో స్థానంలో ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ధోనికి గాయం ఉన్నప్పటికీ అన్ని మ్యాచ్లు ఆడాడు. ధోని తన ఆరో ఐపీఎల్ టైటిల్ గెలుస్తాడని అందరూ అనుకుంటున్నారు.