MS Dhoni: CSK కెప్టెన్‌గా తిరిగొచ్చి మరో IPL రికార్డును బద్దలు కొట్టిన ధోని

Published : Apr 11, 2025, 09:15 PM IST

MS Dhoni: మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోచేయి గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమ‌య్యాడు. దీంతో 43 ఏళ్ల ధోని మ‌ళ్లీ చెన్నై కెప్టెన్ గా తిరిగొచ్చాడు. మ‌రో రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.   

PREV
14
MS Dhoni: CSK  కెప్టెన్‌గా తిరిగొచ్చి మరో IPL రికార్డును బద్దలు కొట్టిన ధోని
MS Dhoni. (Photo- IPL)

MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంఎస్ ధోని తిరిగి వచ్చాడు. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ధోని సీఎస్కేకు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ధోని ఇప్పుడు అతి పెద్ద వయసు కెప్టెన్ గా ఉన్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై ఫ్రాంఛైజీ ధోనిని కెప్టెన్ గా చేసిన వివ‌రాలు పంచుకుంది. ఆ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధోని నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ధోని జట్టును మళ్లీ నడిపించడం పట్ల అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. 

24
MS Dhoni. (Photo: X)

ధోని కెప్టెన్సీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను సాధించింది. ధోని 2024 ఐపీఎల్ ఎడిష‌న్ కు ముందు చెన్నై కెప్టెన్సీని వ‌దులుకుని రుతురాజ్ గైక్వాడ్ అప్ప‌గించాడు. అయితే, ఇప్పుడు గైక్వాడ్ గాయం కార‌ణంగా ఐపీఎల్ కు దూరం కావ‌డంతో ధోని చెన్నై కెప్టెన్ గా మ‌ళ్లీ తిరిగివచ్చాడు. 43 సంవత్సరాల 278 రోజుల వయసున్న ఎంఎస్ ధోని అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత పెద్ద వయసు కెప్టెన్‌గా నిలిచాడు. 

34

కాగా, ఐపీఎల్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ ధోని. అత‌ని నాయ‌క‌త్వంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. ధోని అద్భుత‌మైన ఆట‌తో పాటు సూప‌ర్ కెప్టెన్సీతో చెన్నై టీమ్ కు 2010, 2011, 2018, 2021, 2023 ఎడిష‌న్ల‌లో ఐపీఎల్ టైటిళ్ల‌ను గెలిపించాడు. వీటితో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను కూడా అందించాడు.

44

ఐపీఎల్ 2025లో ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న అంత గొప్పగా లేదు. రుతురాజ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చెన్నై టీమ్ ఐపీఎల్ 2025 పాయింట్ల  పట్టికలో 9వ స్థానంలో ఉంది. సీఎస్కే కంటే దిగువ స్థానంలో  సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఒక్క‌టే ఉంది.

శుక్ర‌వారం కోల్ క‌తా నైట్ రైడర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో సీఎస్కే ధోని కెప్టెన్సీలో బ‌రిలోకి దిగింది. కానీ, జ‌ట్టు ఆట‌తీరులో మార్పు రాలేదు. మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్కే బ్యాట‌ర్లు వ‌చ్చిన వాళ్లు వ‌చ్చిన‌ట్టుగా వికెట్ స‌మ‌ర్పించుకుని పెవిలియ‌న్ కు చేరారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ 79 ప‌రుగులకే 9 వికెట్లు కోల్పోయింది.

Read more Photos on
click me!

Recommended Stories