1900లో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చివరిసారిగా కనిపించింది. ఇక్కడ గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ రెండు జట్లు మాత్రమే తలపడ్డాయి. వీటి మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. అదికూడా టెస్టు ఫార్మాట్ లో రెండు రోజుల మ్యాచ్ జరిగింది. అయితే, దానికి అధికారిక టెస్టుగా గుర్తింపును ఇవ్వలేదు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేలు అంటే మొత్తం 12 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. అలాగే, మరో 94 దేశాలు అసోసియేట్ సభ్య దేశాలు కూడా ఉన్నాయి.