2021లో దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ సెమీస్ చేరలేదు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో కెఎల్ రాహుల్ ఉన్నాడు. రాహుల్.. 5 మ్యాచ్ లలో 194 పరుగులు చేశాడు. బౌలర్లలో రవీంద్ర జడేజా, బుమ్రాలు ఐదు మ్యాచ్ లలో ఏడు వికెట్లతో సమంగా నిలిచారు. మరి 2022 టీ20 ప్రపంచకప్ లో భారత్ నుంచి అత్యధిక పరుగులు చేసే బ్యాటర్, వికట్లు తీసే వీరులెవరో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.