IND vs SA T20I: షమీ, హుడా ఔట్.. శ్రేయాస్ తో పాటు మరో ఆల్‌రౌండర్ ఎంపిక

First Published Sep 27, 2022, 10:42 AM IST

IND vs SA T20I: ఆస్ట్రేలియాను ఓడించి  సిరీస్ దక్కించుకున్న భారత జట్టు.. రేపట్నుంచి దక్షిణాఫ్రికా పని పట్టేందుకు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. 

టీ20  ప్రపంచకప్ కు ముందు రోహిత్ సేన ఆడనున్న చివరి పొట్టి సిరీస్ లో భారత జట్టును గాయాలు వేధిస్తున్నాయి.  ఈ సిరీస్ కు ఎంపికైన వెటరన్ పేసర్ మహ్మద్ షమీతో పాటు స్పిన్ ఆల్ రౌండర్ దీపక్ హుడాలు గాయాలతో  జట్టు నుంచి తప్పుకున్నారు. 

ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు సఫారీలతో మూడు టీ20లకు 15 మంది సభ్యులలో ఒకడిగా ఉన్న మహ్మద్ షమీ.. మొహాలీ టీ20కి రెండ్రోజుల ముందు కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. 

Image credit: Getty

దక్షిణాఫ్రికా సిరీస్ వరకైనా షమీ కోలుకుంటాడని అనుకున్నా  అతడింకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తున్నది. అయితే సఫారీ సిరీస్ లో షమీ స్థానాన్ని ఉమ్రాన్ మాలిక్ తో భర్తీ చేయిస్తారని వార్తలు వచ్చినా సెలక్టర్లు మాత్రం  అలాంటివేమీ చేయలేదు.  
 

అయితే  ఆసీస్ తో పాటు సఫారీ సిరీస్ కు ఎంపికైన దీపక్ హుడా.. వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో  అతడిని సఫారీ సిరీస్ నుంచి తొలగించి  అతడి స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ ను ఎంపిక చేశారు. 

ఇక టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఈ సిరీస్ లో  విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు..  షాబాజ్ అహ్మద్ కు పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికాతో ఈనెల 28 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 
 

దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఆర్.అశ్విన్, చహాల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్ 

click me!