అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఫైనల్ చేరిన న్యూజిలాండ్.. తుది పోరులో ఆసీస్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు రోజులకే భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడింది. టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న కేన్ విలియమ్సన్.. సోమవారం ముంబైలో ముగిసిన రెండో టెస్టుకు కూడా దూరంగా ఉన్నాడు.