అయితే ఏడాది గడిచేసరికి సీన్ రివర్స్ అయ్యింది. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడిన పాక్ జట్టు, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనూ 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. గత టోర్నీలో పాక్ టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన షాహీన్ ఆఫ్రిదీ, ఆసిఫ్ ఆలీ, మహ్మద్ రిజ్వాన్.. ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు...