దేశవాళీ క్రికెట్ లో భాగంగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్టీ) లో ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. ఈ ట్రోఫీలో క్వార్టర్స్ దశ పోటీలు ముగిశాయి. నవంబర్ 28న ముగిసిన నాలుగు క్వార్టర్స్ మ్యాచ్ లలో విజేతలు సెమీస్ చేరారు. పంజాబ్-కర్నాటక, మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్ - అసోం, తమిళనాడు - సౌరాష్ట్రల మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఈ పోటీలలో కర్నాటక, మహారాష్ట్ర, అసోం, సౌరాష్ట్రలు విజయం సాధించి సెమీస్ కు చేరాయి.