ఈ మ్యాచ్ లో భారత్ ఒత్తిడికి చిత్తయ్యిందని అందుకే చివర్లో తడబడిందని కైఫ్ తెలిపాడు. కెప్టెన్సీ, బౌలింగ్ మార్పుల గురించి మాట్లాడినా ప్రయోజనం లేదని, 40 ఓవర్ల దాకా భారత్ నియంత్రణలో ఉన్న మ్యాచ్ ను హసన్ మిరాజ్ తర్వాత బంగ్లా వైపునకు మలుపు తిప్పాడని కైఫ్ తెలిపాడు. చివర్లో ఎలా ఆడాలో హసన్ బంగ్లాదేశ్ బ్యాటర్లకు చూపించాడని కైఫ్ కొనియాడాడు.