సంజూ శాంసన్ తప్ప రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ లు బంగ్లాదేశ్ టూర్ లో ఉన్నారు. పంత్ కు గాయమని సిరీస్ నుంచి తప్పించినా ఇషాన్ కు గ్లవ్స్ ఇవ్వకుండా రాహుల్ కే ఆ బాధ్యతలు అప్పగించడంతో భారత జట్టు వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకునే ఇలా చేసిందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ రాహుల్ ను కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం పంత్, శాంసన్, ఇషాన్ లు వరల్డ్ కప్ మీద ఆశలు వదులుకోవాల్సిందే.