రివ్యూ మీటింగ్ లో భాగంగానే గతంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్స్ లో భాగమైన యో యో టెస్టును తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు బోర్డు పెద్దలు. గత ఏడాదిన్నర కాలంగా జట్టుకు వరుస గాయాలు, ఫిట్నెస్ సమస్యలతో కీలక టోర్నీలకు సీనియర్ ప్లేయర్లు దూరమయ్యారు. దీంతో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలలో భారత్ దారుణ వైఫల్యం మూటగట్టుకోవాల్సి వచ్చింది.