కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ శర్మ, ఇంగ్లాండ్తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో వేసిన రెండో ఓవర్లోనే వికెట్ తీశాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో డొమినిక్ సిబ్లీ, రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఏడో ఓవర్లో బంతి అందుకున్న అక్షర్ పటేల్, తొలి బంతికే బెయిర్స్టోను అవుట్ చేయడంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.