ఐసీసీ టోర్నీలో భారత్ మరోసారి అవమానకర రీతిలో నిష్క్రమించడం ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లకూ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, భువనేశ్వర్ వంటి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని, టీ20 ఫార్మాట్ కు కొత్త క్రికెట్ టీమ్, కెప్టెన్, కోచ్ లను మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.