రాయుడు 3డి దూకుడు: వ్యాఖ్యాతగా ఎమ్మెస్కే(కి) 'ప్రసాద్స్' లో చూడదగ్గ షో

First Published Sep 20, 2020, 10:18 AM IST

తాజాగా 2020 ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌్స తరఫున రాయుడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 48 బంతుల్లో 71 పరుగులతో ముంబయి ఇండియన్‌్సపై ధోనీసేనకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు. 

'ఇప్పుడే కొత్త 3డీ అద్దాలు ఆర్డర్‌ చేశాను' 2019 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక అనంతరం తెలుగు స్టార్ అంబటి రాయుడు చేసిన ఈ ట్వీట్‌ భారత క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపింది. నం.4 బ్యాటర్‌గా ఏడాది కాలంగా నిలకడగా రాణించిన రాయుడిని కాదని, తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది.
undefined
రాయుడికి జట్టులో చోటు దక్కకపోవటంపై అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడుతూ..' విజయ్‌ శంకర్‌ 3 డైమెన్సనల్‌ క్రికెటర్‌. బ్యాట్‌తో, బంతితో, ఫీల్డర్‌గా జట్టుకు ఉపయుక్తమైన ఆటగాడు' అని కితాబిచ్చాడు.
undefined
ప్రసాద్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాయుడు 3డీ అద్దాల ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవటంతో రాయుడు కెరీర్‌కు వీడ్కోలు సైతం పలికాడు.
undefined
తాజాగా 2020 ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌్స తరఫున రాయుడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 48 బంతుల్లో 71 పరుగులతో ముంబయి ఇండియన్‌్సపై ధోనీసేనకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు.
undefined
ప్రపంచ నం.1 పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాపై విరుచుకుపడిన రాయుడు ధనాధన్ ఆడేశాడు. అర డజను ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగాడు. 62తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న చెన్నైని డుప్లెసిస్‌ (58 నాటౌట్‌) తోడుగా రాయుడు విజయ తీరాలకు చేర్చాడు.
undefined
సుదీర్ఘ కాలంగా క్రికెట్‌కు దూరమైన రాయుడు.. అబుదాబిలో అలవోకగా బౌండరీలు బాదటం చూసిన అభిమానులు, విశ్లేషకులు ఔరా అని అనుకున్నారు. రాయుడు మెరుపులతో ప్రపంచకప్‌ జట్టులో ఈ ఆటగాడికి చోటు ఎలా నిరాకరించారు? రాయుడు ఉంటే 2019 ప్రపంచకప్‌లో భారత్ ముగింపు మరో విధంగా ఉండేది కదా? అనే భావన కలిగింది.
undefined
ప్రపంచకప్‌ జట్టులో చోటు నిరాకరణ.. ఇద్దరు తెలుగు క్రికెటర్ల మధ్య ఆసక్తికర వైరానికి తెరతీసింది. ఐపీఎల్ 2020కి స్టార్‌స్పోర్ట్‌ తెలుగు ఛానల్‌కు ఎమ్మెస్కే ప్రసాద్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
undefined
ముంబయి బౌలర్లను చీల్చి చెండాడుతున్న రాయుడిని వ్యాఖ్యాతగా ప్రసాద్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. 3 డీ ఆటగాడు కాదు అని, ప్రపంచకప్‌ జట్టులో చోటు నిరాకరించిన ప్రసాదే.. ఇప్పుడు స్వయంగా రాయుడిని అహో, ఓహో అని ప్రశంసించటం క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తి లేపింది.
undefined
సోషల్‌ మీడియాలో అభిమానులు సైతం రాయుడు.. 3డీ చూపించాడు అని పోస్టులు పెడుతున్నారు. అన్నట్టు అబుదాబిలో రాయుడు ముంబయి బౌలర్లతో పాటు ఎమ్మెస్కే ప్రసాద్‌కు సైతం తనలోని 3డీ ఆటను చూపించాడు.
undefined
click me!