దేశవాళీ క్రికెట్ లో 6 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డులు సాధించిన ప్రియాంష్ ఆర్య కోసం ఐపీఎల్ 2025 మెగా వేలంలో బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి పంజాబ్ కింగ్స్ 3.8 కోట్లకు దక్కింకుకుంది. అతని బేస్ ప్రైస్ INR 30 లక్షలుగా ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.
ప్రియాంష్ ఆర్య మొదట ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో సంచలనం సృష్టించాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ తరపున ఒకే ఓవర్లో ఆరు వరుసగా సిక్సర్లు కొట్టి చరిత్ర సృష్టించాడు. కేవలం 50 బంతుల్లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 20 పరుగుల ఇన్నింగ్స్ తో అతని జట్టుకు 308/5 భారీ స్కోరును అందించాడు. ఈ లీగ్లో 10 మ్యాచ్లలో 600లకు పైగా పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్ లో అత్యంత భయంకరమైన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు.
ఐపీఎల్ అరంగేట్రానికి ముందు 2023-24 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ప్రియాంష్ ఆర్య ఢిల్లీ తరపున ఏడు ఇన్నింగ్స్లలో 31.71 సగటు, 166.91 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్లో తమిళనాడుపై 47 బంతుల్లో 81 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు.
2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఆర్య ఫామ్ కొనసాగించాడు. కేవలం 43 బంతుల్లోనే 102 పరుగులతో సెంచరీ కొట్టాడు. తొమ్మిది ఇన్నింగ్స్లలో 40.6 సగటు, 176.6 స్ట్రైక్ రేట్తో మొత్తం 325 పరుగులు చేశాడు.